ప్రియుడి కోసం పెద్దలను ఎదురించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి.. చివరకు ఆమె పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2022-07-16T23:16:32+05:30 IST
ప్రేమించిన వాడి కోసం కన్నవాళ్లను ఎదురించింది.. అతడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయింది..
ప్రేమించిన వాడి కోసం కన్నవాళ్లను ఎదురించింది.. అతడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయింది.. ప్రేమికుడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలనుకుంది.. అయితే పెళ్లి తర్వాత ప్రియుడి నిజ స్వరూపం బయటపడింది.. అతడు ఎంత క్రూరుడో తెలుసుకుంది.. మరో యువతితో సంబంధం పెట్టుకుని కట్నం కోసం తనను వేధించడాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.. రాజస్థాన్లోని కోటలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
అంత్యక్రియల మధ్యలోనే సగం కాలిన మృతదేహాన్ని చితిపై నుంచి లాగేసిన పోలీసులు.. ఆ రాత్రి అసలేం జరిగిందంటే..
గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన రీనా అనే యువతి Rajastan లోని కోటకు చెందిన కరణ్ సింగ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో 5 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కరణ్ సింగ్ అసలు స్వరూపం రీనాకు బోధపడింది. వివాహం తర్వాత కట్నం కోసం రీనాని కరణ్ వేధించేవాడు. అలాగే పూజ అనే మరో అమ్మాయితో కరణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి రీనా నిలదీయడంతో ఆమెపై పలుసార్లు భౌతికదాడులకు పాల్పడ్డాడు.
ఎంతగానో ప్రేమించిన భర్త మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించడం, తనను హింసించడంతో రీనా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. శుక్రవారం తన సోదరికి వాట్సాప్లో ఓ ఆడియో ఫైల్ పంపి ఆత్మహత్య చేసుకుంది. తన మృతికి భర్త, అతని ప్రియురాలు కారణమని ఆ ఆడియో ఫైల్లో పేర్కొంది. దీంతో రీనా తండ్రి, సోదరి.. కరణ్పై, అతని ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.