చాలా రోజులుగా కనిపించని అన్న.. వదినను ఒంటరిగా పిలిచి ఆరా తీసిన తమ్ముడు షాక్.. అసలు నిజం ఏంటంటే?

ABN , First Publish Date - 2022-06-10T08:30:13+05:30 IST

అన్న కనిపించడం లేదని కొన్ని రోజులుగా టెన్షన్ పడుతున్నాడా తమ్ముడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. కుటుంబీకులు అడ్డుకున్నారు. ఏదైనా పని మీద పక్క ఊరికి వెళ్లాడేమో? అని వాళ్ల అనుమానం. ఎంత వెతికినా అన్న గురించి తెలియకపోవడంతో ఆ తమ్ముడికి కూడా ఏదో అనుమానం వచ్చింది...

చాలా రోజులుగా కనిపించని అన్న.. వదినను ఒంటరిగా పిలిచి ఆరా తీసిన తమ్ముడు షాక్.. అసలు నిజం ఏంటంటే?

అన్న కనిపించడం లేదని కొన్ని రోజులుగా టెన్షన్ పడుతున్నాడా తమ్ముడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. కుటుంబీకులు అడ్డుకున్నారు. ఏదైనా పని మీద పక్క ఊరికి వెళ్లాడేమో? అని వాళ్ల అనుమానం. ఎంత వెతికినా అన్న గురించి తెలియకపోవడంతో ఆ తమ్ముడికి కూడా ఏదో అనుమానం వచ్చింది. వదినను ఇంటికి దూరంగా తీసుకెళ్లి గట్టిగా ప్రశ్నించాడు. దాంతో ఆమె చెప్పిన నిజం విని అతనికి గుండె పగిలినంద పనైంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బరేలీలో వెలుగు చూసింది. 


ద్వారకా ప్రసాద్ అనే వ్యక్తికి మనోజ్ అనే మహిళతో చాలాకాలం క్రితం పెళ్లయింది. ప్రసాద్‌కు మద్యం తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల ఒక రోజు అలాగే బాగా తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడతను. ఆ గొడవలోనే తాను కోపంతో అతన్ని సుత్తితో కొట్టానని, ఒక్క దెబ్బకే ప్రసాద్ చనిపోయాడని మనోజ్ చెప్పింది. అతని శవాన్ని ఇంటికి దూరంగా తీసుకెళ్లి నాలుగడుగుల లోతు గొయ్యి తీసి పూడ్చేశానని ఆమె పేర్కొంది. 


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెకు ఎవరైనా సహకరించారా? లేక ఒక్కతే ఈ దారుణానికి ఒడిగట్టిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 25 రోజులుగా పూడ్చిపెట్టేసి ఉండటంతో ద్వారకా ప్రసాద్ మృతదేహం బాగా దెబ్బతిన్నదని అధికారులు చెప్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-10T08:30:13+05:30 IST