8ఏళ్ల క్రితం భర్త మృతి.. రెండేళ్లుగా వ్యక్తితో సహజీవనం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-27T02:11:38+05:30 IST

ఆమెకు సుమారు పదేళ్ల క్రితం పెళ్లైంది. అయితే దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. దీంతో ఆమె ఒంటరైంది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనం చేసే వర

8ఏళ్ల క్రితం భర్త మృతి.. రెండేళ్లుగా వ్యక్తితో సహజీవనం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సుమారు పదేళ్ల క్రితం పెళ్లైంది. అయితే దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. దీంతో ఆమె ఒంటరైంది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనం చేసే వరకూ వెళ్లింది. అయితే తాజాగా భాగస్వామి చేసిన పనికి ఆమె ఆసుపత్రిపాలైంది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని కోత్వాలి ప్రాంతినికి చెందిన సోనూ అనే మహిళకు సుమారు 10ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. దీంతో ఆరేళ్లపాటు ఒంటిరిగానే జీవితాన్ని నెట్టికొచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్త  సహజీవనం వరకూ వెళ్లింది. దీంతో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. రెండేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే బాగా తాగుడుకు అలవాటు పడ్డ అతడు.. డబ్బుల కోసం సోనూను రోజూ వేధించేవాడు. శనివారం ఉదయాన్నే తాగేసి ఇంటికెళ్లిన అతడు.. డబ్బులు ఇవ్వాలని సోనూతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో.. గొడ్డలిపై దాడి చేశాడు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ముక్కుకు తీవ్ర గాయమవడంతో ప్రస్తుతం సోనూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 




Updated Date - 2021-12-27T02:11:38+05:30 IST