Shocking News: మహిళ చేసిన పనికి కుటుంబ సభ్యులు షాక్.. భర్త‌పై ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇలా చేయాలా!

ABN , First Publish Date - 2022-07-02T14:44:49+05:30 IST

ఆ భార్యభర్తలకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. తాజాగా .. ఆ భార్యాభర్తలకు గొడవ జరిగింది. దీంతో భార్య దారుణామైన నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి ఇద్దరు పిల్లలు ప్రాణా

Shocking News: మహిళ చేసిన పనికి కుటుంబ సభ్యులు షాక్.. భర్త‌పై ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇలా చేయాలా!

ఇంటర్నెట్ డెస్క్: ఆ భార్యభర్తలకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. తాజాగా .. ఆ భార్యాభర్తలకు గొడవ జరిగింది. దీంతో భార్య దారుణామైన నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచారు. కాగా.. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని ధర్ ప్రాంతానికి చెందిన సంతోష్ సిందాల్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం మమత అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీళ్లు.. సాక్షి(8), పారీ (7), కునాల్ (3) అనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సంతోష్.. ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పని మీద జైపూర్ వెళ్లిన సంతోష్.. 15 రోజులుగా అక్కడే ఉంటున్నాడు. తాజాగా.. ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఈ  దంపతులు గొడవకు దిగారు. దీంతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం దారుణమైన నిర్ణయం తీసుకుంది.



ఎలుకల మందు నీళ్లలో కలిపి పిల్లలతో తాగించింది. అనంతరం ఆమె కూడా ఆ నీళ్లను తాగింది. కొంత సమయం తర్వాత తల్లీబిడ్డలు వాంతులు చేసుకోవడం.. తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే పారీ ప్రాణాలు వదిలింది. సాక్షి, కునాల్, మమత ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో వారిని వైద్యులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో వారిని ఇతర హాస్పిటల్‌కు తరలిస్తుండగానే.. కునాల్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం సాక్షి, మమత‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. భర్త మీద కోపంతో ఆమె చేసిన పని స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-02T14:44:49+05:30 IST