అద్దెకు ఇల్లు చూపిస్తానని తీసుకెళ్లి అత్యాచారం.. నాలుగు రోజులు బంధించి నరకం.. చివరకు ఆమో ఎలా తప్పించుకుందంటే..
ABN , First Publish Date - 2022-03-06T05:46:29+05:30 IST
ఒక మహిళని అద్దెకు ఇల్లు చూపిస్తానని చెప్పి ఆమెను ఒక గదిలో బంధించి నాలుగు రోజులుగా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కంఝావాలా ప్రాంతంలో జరిగింది
ఒక మహిళని అద్దెకు ఇల్లు చూపిస్తానని చెప్పి ఆమెను ఒక గదిలో బంధించి నాలుగు రోజులుగా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కంఝావాలా ప్రాంతంలో జరిగింది. బీహార్కు చెందిన 32 ఏళ్ల బాధిత మహిళ తన సోదరుడితో కలిసి ఢిల్లీలో కరాలా ప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చి కొత్తగా మరో అద్దె ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
కరాలా బస్టాండ్కు సమీపంలో నిలబడి ఉన్న రామ్సింగ్ అనే వ్యక్తిని అద్దె ఇంటి గురించి అడిగింది. అతను వెంటనే ఇల్లు చూపిస్తానని ఆమెను తీసుకెళ్లాడు. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెను గదిలో పెట్టి తాళం వేశాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఆమెను బంధీగా ఉంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం రామ్సింగ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఆ సమయంలో బాధితురాలు గది కిటికీలో నుంచి అరుపులు వేయగా.. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని బయటికి తీశారు. అక్కడి నుంచి బయటపడి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. పోలీసులు ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. రామ్సింగ్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.