రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-03-07T00:05:41+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. నార్సింగి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జా గూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద పద్మ అనే మహిళ వెళుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీ  కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పద్మను ఢీ కొట్టి తన కారును వదిలేసి పారిపోతున్న రామకృష్ణారెడ్డిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-07T00:05:41+05:30 IST