రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-26T05:20:11+05:30 IST
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఆమె భర్తకు తీవ్ర గాయాలైన సంఘ టన గురువారం రాత్రి సంతనూతలపాడు చెరువు సమీపంలో జరిగింది.
భర్తకు తీవ్రగాయాలు
లారీడ్రైవర్ పరారీ
సంతనూతలపాడు, నవంబరు 25: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఆమె భర్తకు తీవ్ర గాయాలైన సంఘ టన గురువారం రాత్రి సంతనూతలపాడు చెరువు సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు చీరాలకు చెందిన చుంచు నాగేశ్వరరావు, వెంకాయమ్మ(51) దంపతులు చీమకుర్తిలోని తన సోదరుడి ఇంటికి వచ్చి స్కూటీపై తిరుగు ప్రయాణమయ్యారు. వారు సంతనూతలపాడులోని చెరువు సమీపంలోకి రాగానే చీమకుర్తి వైపు నుంచి వస్తున్న టిప్పర్ వెనుకవైపు నుంచి స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో నా గేశ్వరరావు రోడ్డు పక్కన తీవ్రగాయాలతో పడిపోగా, అతని భార్య వెంకాయమ్మపై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడిఅక్కడే మృతి చెందింది. ఆ మె మృతదేహం ఛిద్రమైంది. ఈ విష యం గమనించి న చుట్టుపక్కల వాహ నదారులు ప్రమాదా నికి కారణమైన డ్రై వర్ను పట్టుకునే ప్ర యత్నం చేయగా డ్రై వర్ వాహ నాన్ని రో డ్డు పక్కనే వదిలేసి పక్కన ఉన్న పొలాల్లోకి పరార య్యాడు. ఈ ప్రమాదంపై కడపటి సమాచారం అందేవరకు పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.