కొడుకు, కూతురిని చంపేసిన తల్లి.. కారణం ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-03T22:17:58+05:30 IST

అమ్మతనానికే మచ్చ లాంటి ఘటన వెలుగుచూసింది. ఆపకుండా ఏడుస్తున్నారనే కారణంతో 4 నెలల ఆడ శిశువుతోపాటు

కొడుకు, కూతురిని చంపేసిన తల్లి.. కారణం ఏంటో తెలుసా..

నాందేడ్ : అమ్మతనానికే మచ్చ లాంటి ఘటన వెలుగుచూసింది. ఆపకుండా ఏడుస్తున్నారనే కారణంతో కొడుకు, కూతురిని కన్నతల్లే కడతేర్చింది. అత్యంత అమానవీయమైన ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


నాందేడ్ జిల్లా భోకార్ తాలూకాలోని పండుర్ణా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ధుర్పాదబాయ్ గణ్పత్ నిమల్వాడ్ తన కన్నపేగులనే కర్కశంగా చంపేసింది. ఆపకుండా ఏడుస్తుందనే కారణంగా 4 నెలల కూతురు అనుసూయను గొంతు నులిమి ప్రాణాలు తీసింది. మే 31న ఈ ఘటన జరగగా.. మరుసటి రోజే జూన్ 1న కొడుకు దత్తాను కూడా ఇదే రీతిలో గొంతునొక్కి చంపేసింది. తినడానికి ఏమైనా కావాలంటూ ఏడుస్తున్న బాలుడిని కనికరం లేకుండా అంతమొందించిందని పోలీసులు వివరించారు. మృతదేహాలను వ్యవసాయ క్షేత్రంలో తగులబెట్టారని చెప్పారు. ఈ విషయంలో నిందితురాలికి ఆమె తల్లి, సోదరుడు సాయం చేశారని స్థానిక భోకార్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.


నిందితురాలికి సహకరించిన తల్లి కొండాబాయ్ రాజేమోద్, సోదరుడు మాధవ్ రాజేమోద్ ఇద్దరిపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు అధికారి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-03T22:17:58+05:30 IST