ఆత్మహత్య చేసుకుందామని రైలు కింద పడింది.. పై నుంచి రైలు వెళ్లాక లేచి కూర్చున్న ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-15T20:21:10+05:30 IST

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న యువతి అనూహ్యంగా బతికిపోయింది.

ఆత్మహత్య చేసుకుందామని రైలు కింద పడింది.. పై నుంచి రైలు వెళ్లాక లేచి కూర్చున్న ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే..

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న యువతి అనూహ్యంగా బతికిపోయింది. అయితే అంత ప్రమాదం తప్పిన తర్వాత ఆ యువతి ప్రవర్తించిన తీరు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఎరుపు రంగు చుడీదార్, బ్లూ కలర్ స్కార్ఫ్ ధరించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. రైలు రావడం చూసి పట్టాలపై నిలువుగా పడుక్కుంది. పట్టాలపై నిలువుగా ఉండడం వల్ల ఆ యువతికి చిన్న గాయం కూడా కాలేదు. 


దాదాపు రెండు నిమిషాల పాటు పై నుంచి గూడ్సు రైలు వెళ్లిపోయిన తర్వాత ఆ యువతి పైకి లేచింది. అసలు ఏమీ జరగనట్టు ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికి లక్షకు పైగా వ్యూస్ దక్కించుకుంది.



Updated Date - 2022-04-15T20:21:10+05:30 IST