ఓ సారి కలుద్దాం.. అంటూ స్నేహితుడి నుంచి ఆ భార్యకు ఫోన్.. సరేనని వెళ్తే జరిగిందో ఘోరం.. విషయం భర్తకు తెలిసి..

ABN , First Publish Date - 2021-11-15T12:00:48+05:30 IST

పెళ్లైన తరువాత కూడా ప్రేమ వ్యవహారం నడపడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చెప్పడానికి సునీత కథ ఒక నిదర్శనం. సునీత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో నివసిస్తోంది. 2016లో ఒక పెళ్లి వేడుకలో సునీతకు గోపాల్ అనే వ్యక్తితో పరిచయం...

ఓ సారి కలుద్దాం.. అంటూ స్నేహితుడి నుంచి ఆ భార్యకు ఫోన్.. సరేనని వెళ్తే జరిగిందో ఘోరం.. విషయం భర్తకు తెలిసి..

పెళ్లైన తరువాత కూడా ప్రేమ వ్యవహారం నడపడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చెప్పడానికి సునీత కథ ఒక నిదర్శనం. సునీత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో నివసిస్తోంది. 2016లో ఒక పెళ్లి వేడుకలో సునీతకు గోపాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ కొద్దికాలానికే విడిపోయారు. ఆ తరువాత సునీత తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు.


సునీత భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుండగా.. ఒకరోజు అనుకోకుండా గోపాల్ ఫోన్ చేశాడు. తనతో ఒకసారి కలవాలని కోరాడు. అందుకు సునీత ముందు సందేహ పడింది. కానీ ఎందుకనో గోపాల్‌తో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి సరేనని ఒప్పుకొంది. ఇద్దరూ ఒక హోటల్ గదిలో కలుసుకున్నారు. అక్కడ గోపాల్ తనని ప్రేమిస్తున్నానని.. ఆమె లేకుండా ఉండలేనని చెప్పాడు. దానికి సునీత ఒప్పుకోలేదు. అప్పుడు గోపాల్ సునీతను బలవంతంగా లోబర్చుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేశాక.. భర్తని వదిలి వచ్చేస్తే తనని ప్రేమగా చూసుకుంటానని అన్నాడు.


ఈ సంఘటన తరువాత సునీత ఇంటికి వెళ్లగా.. అక్కడ భర్త సునీత పరిస్థితి గమనించి.. ఏం జరిగిందని ప్రశ్నించాడు. సునీత ఒకింత భయంతో గోపాల్ తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. సునీత మాటలు విన్న ఆమె భర్త అత్తమామలను పిలిచి ఇదంగా ఏమిటని ప్రశ్నించాడు. ఇకపై సునీతతో తనకు ఏ సంబంధం లేదని ఆమెను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ఆమె తల్లిదండ్రులు కూడా సునీత వివాహం జరిగాక తన ప్రియుడితో సంబంధం పెట్టుకోవడం సరైనది కాదని ఆమెను తిరస్కరించారు. ఎటుపోవాలో తెలియక సునీత మళ్లీ గోపాల్‌కు ఫోన్ చేసింది.


భర్తతో విడిపోయిన సునీత తన ప్రియుడు గోపాల్ వద్దకు చేరింది. అలా గోపాల్ సునీతలు సహజీవనం చేస్తున్నారు. గోపాల్ సునీతను వివాహం చేసుకుంటానని చెప్పి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. కానీ నాలుగేళ్లైనా ఆమెను వివాహం చేసుకోలేదు. పెళ్లి గురించి ప్రస్తావన రాగానే మాట దాటేసేవాడు. మూడు నెలల క్రితం సునీత గర్భవతి అని తెలిసింది. ఇకనైనా తనని పెళ్లి చేసుకోమని గోపాల్‌తో సునీత గొడవపడింది. దీంతో గోపాల్ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. రెండు నెలలుగా ఇంటికి రాలేదు. ఒకరోజు సునీతకు ఫోన్ చేసి ఇక తనకు ఆమెతో ఏ సంబంధం లేదని, ఫోన్ కూడా చేయొద్దని బెదిరించాడు. గోపాల్ మాటలతో తన జీవితం నాశనమైపోయిందని గ్రహించిన సునీత పోలీసులను ఆశ్రయించింది.


పోలీసులు సునీత చేసిన ఫిర్యాదు మేరకు గోపాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2021-11-15T12:00:48+05:30 IST