తల్లి మ‌ృతదేహంతో 10 రోజులుగా ఇంట్లోనే ఉన్న యువతి.. ఇంతకీ ఆమె లోపల ఏం చేస్తోందంటే?..

ABN , First Publish Date - 2022-05-27T09:20:46+05:30 IST

ఒక యువతి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి తను కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. కొన్ని రోజులుగా తల్లికూతుళ్లు కనబడకపోవడంతో పక్కింటి మహిళ ఆమెకోసం ఇంటికి వెళ్లగా.. బయటి నుంచే దుర్వాసన వచ్చింది. తలుపులు ఎంత కొట్టినా ఎవరూ తీయకపోవయడంతో చుట్టు పక్కల వారంతా వచ్చి తలుపులు బద్దులు...

తల్లి మ‌ృతదేహంతో 10 రోజులుగా ఇంట్లోనే ఉన్న యువతి.. ఇంతకీ ఆమె లోపల ఏం చేస్తోందంటే?..

ఒక యువతి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి తను కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. కొన్ని రోజులుగా తల్లికూతుళ్లు కనబడకపోవడంతో పక్కింటి మహిళ ఆమెకోసం ఇంటికి వెళ్లగా.. బయటి నుంచే దుర్వాసన వచ్చింది. తలుపులు ఎంత కొట్టినా ఎవరూ తీయకపోవయడంతో చుట్టు పక్కల వారంతా వచ్చి తలుపులు బద్దులు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా.. ఆ యువతి ఏం చేస్తోందంటే..


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్‌నవూ నగరంలొ ఇందిరా నగర్ ప్రాంతంలో నివసించే సనీతా దీక్షిత్ అనే మహిళ తన కూతురు అంకితతో కలిసి నివసిస్తోంది. సునీతా  ఒక రిటైర్డ్ ఇంజినీర్. ఆమె హిందుస్తాన్ ఏరానాటికల్ లిమిటెడ్ సంస్థలో పనిచేసేది. సునీత కూతురు అంకిత(26) కూడా ఒక ఉద్యోగం చేస్తోంది. సునీతా తరుచూ తన పక్కింటి మహిళతో రోజూ మాట్లాడుతూ ఉండేది. కానీ పది రోజులుగా ఆమె అసలు బయటికే రాలేదు. దీంతో పక్కింటి మహిళ సునీతకు అనారోగ్యం చేసిందేమోనని పలకరించేదుకు వెళ్లింది. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో ఆ  పక్కింటి మహిళ తలుపులు కొట్టింది. ఇంతలో ఏదో దుర్వాసన వచ్చింది. అయినా ఆమె తలుపులు కొడుతూనే ఉంది. కానీ ఎవరూ తలుపులు తీయలేదు. దీంతో సదరు మహిళ ఇరుగుపొరుగు వారిని పిలిచింది.


ఇరుగుపొరుగు వారంతా కలిసి ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారంతా వెళ్లి చూడగా.. అంకిత తన గదిలో ఏవో పూజలు చేస్తోంది. ఆమె తల్లి సునీత మాత్రం ఎక్కడుంతో కనపడలేదు. కానీ ఒక గదిలో నుంచి చాలా ఘాటుగా దుర్వాసన వస్తోంది. ఆ గది లాక్ చేసి ఉంది. అంకితను వారంతా ఆ గది తాళాలు ఇవ్వమని అడిగారు. కానీ అమె ఇవ్వలేదు. దీంతో వారంతా ఆ గది తలుపులు పగలకొట్టారు. లోపలికి వెళ్లి చూస్తే సునీత మృతదేహం కనబడింది. ఆ శవం కాస్త కుళ్లిపోయింది. ఆ తరువాత వారంతా పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు సునీత మృతదేహాన్ని పోస్లుమార్టం కోసం పంపించారు. అంకితను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆమె ఒక విషయం మాత్రమే చెప్పింది. ఇటీవల తన తల్లిని కలిసేందుకు ఒక యువకుడు తరుచూ వచ్చేవాడని తెలిపింది. పోలీసులు.. అంకిత మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. ఇంట్లో ఆమె ఏదో చేతబడి చేసినట్లు కూడా అనుమానం తెలిపారు. సునీతకు ఒక యువకుడితో సంబంధం ఉండడంతో ఆమె కూతురు అంకితనే ఆమె హత్య చేసిందేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునీత పోస్టుమార్టం రిపోర్టు రాగానే విచారణ ముందుకు సాగుతుందని పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-05-27T09:20:46+05:30 IST