ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-06T05:54:18+05:30 IST

ఆమె నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. తాజాగా అతడితో కలిసి హోటల్‌కు వెళ్లింది.. ఆ సమయంలో ఆమె వేరే యువకుడి నుంచి ఫోన్ వచ్చింది.. దీంతో ఆమె ప్రియుడికి అనుమానం కలిగింది.. తనతో పాటు మరో యువకుడితో...

ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఆమె నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. తాజాగా అతడితో కలిసి హోటల్‌కు వెళ్లింది.. ఆ సమయంలో ఆమె వేరే యువకుడి నుంచి ఫోన్ వచ్చింది.. దీంతో ఆమె ప్రియుడికి అనుమానం కలిగింది.. తనతో పాటు మరో యువకుడితో కూడా ఆమె ప్రేమాయణం సాగిస్తోందని ఆగ్రహం చెందిన ప్రియుడు ఆమెను కొట్టాడు.. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్ చౌహాన్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉంటూ అక్కడి యువతితో నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. గత నెల 27న ఇతను ఢిల్లీలోని ఓ హోటల్‌కు తన ప్రేయసితో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు ఉత్కర్ష్ అనే యువకుడి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ గురించి శివమ్ ఆరా తీశాడు. మొదట ఉత్కర్ష్‌ను తన అక్క ఫ్రెండ్‌‌గా చెప్పిన బాధిత యువతి తర్వాత మాట మార్చింది. 


దీంతో ఆ యువతిపై శివమ్‌కు అనుమానం మొదలైంది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన శివమ్ ఆమెను గట్టిగా కొట్టాడు. ఆమె తల నేరుగా ఫ్లోర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మరణించింది. భయపడిన శివమ్ అక్కణ్నుంచి పరారయ్యాడు. హోటల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామంలో అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-03-06T05:54:18+05:30 IST