30 పెళ్లిల్లు చేసుకున్న వధువు.. అసలు కథేంటంటే?

ABN , First Publish Date - 2022-05-23T08:34:28+05:30 IST

ఎవరైనా తమ జీవితంలో ఒకే ఒకసారి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్న కథలు విన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకుంది. తను పెళ్లాడిన వాళ్లందర్నీ..

30 పెళ్లిల్లు చేసుకున్న వధువు.. అసలు కథేంటంటే?

ఎవరైనా తమ జీవితంలో ఒకే ఒకసారి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్న కథలు విన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకుంది. తను పెళ్లాడిన వాళ్లందర్నీ వదిలేసి పారిపోయింది. ఆమెను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని డూంగర్‌పుర్ జిల్లాకు చెందిన సీతా చౌదరి ఉరఫ్ రీనా ఠాకూర్ అనే యువతి గతేడాది డిసెంబరు 12న పెళ్లి చేసుకుంది. జోధ్‌పురాకు చెందిన ప్రకాష్‌చంద్రకు ఈ సంబంధం తెచ్చినందుకు ఏజెంట్, రీనా కలిసి రూ.5లక్షలు వసూలు చేశారు. పెళ్లయిన వారం రోజులపాటు అతనితో కాపురం చేసిన రీనా.. ప్రకాష్‌చంద్రతోపాటు జబల్‌పూర్ వెళ్లింది. మళ్లీ తిరిగి వచ్చే సమయంలో కొందరు వచ్చి ప్రకాష్‌చంద్రపై దాడి చేశారు. వాళ్లతో కలిసి ప్రకాష్‌పై దాడి చేసిన రీనా.. అట్నుంచి అటే పరారైంది. దీంతో తన డబ్బులు తిరిగిచ్చేయాలని ఏజెంట్‌ను సంప్రదించాడు ప్రకాష్. అప్పటికే అతను ఫోన్ నెంబర్ మార్చేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు ప్రకాష్. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆమె ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. 


విచారణ సందర్భంగా తమది పెద్ద గ్యాంగ్ అని, పెళ్లిళ్ల పేరుతో ఇలా మోసం చేస్తూ ఉంటామని రీనా వెల్లడించింది. ఇప్పటి వరకు తను 30 పైగా పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపింది. ఇలా నకిలీ పెళ్లిళ్లు చేసుకోవడం కోసం, నకిలీ ఆధార్ కార్డుల వంటి పత్రాలు కూడా తయారు చేసుకుంటామని వివరించింది. పెళ్లి చేసుకున్న తర్వాత చేతికి అందినంత సొమ్ము తీసుకొని పారిపోతామని, ఆ తర్వాత మరో అబ్బాయికి వల వేస్తామని చెప్పింది. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు చెప్పారు.


Updated Date - 2022-05-23T08:34:28+05:30 IST