వేగంగా వెళ్తున్న రైలు.. బాత్రూంలోంచి ఓ మహిళ కేకలు.. ప్రయాణికులు వెళ్లి పగలగొట్టి చూస్తే..

ABN , First Publish Date - 2022-01-26T21:15:08+05:30 IST

ఆపదలో ఆదుకోవాల్సిన పోలీస్ అధికారే ఆపద సృష్టించాడు. మద్యం మత్తులో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వేగంగా వెళ్తున్న రైలు.. బాత్రూంలోంచి ఓ మహిళ కేకలు.. ప్రయాణికులు వెళ్లి పగలగొట్టి చూస్తే..

ఆపదలో ఆదుకోవాల్సిన పోలీస్ అధికారే ఆపద సృష్టించాడు. మద్యం మత్తులో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రన్నింగ్ ట్రైన్‌లో మహిళను బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో ఇతర ప్రయాణికులు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. 


హర్యానాలోని కైతాలి జిల్లాకు చెందిన బాధిత మహిళ సోమవారం రాత్రి రైలులో ప్రయాణం సాగిస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఆమె బాత్రూమ్‌కు వెళ్లింది. అప్పటికే ఆ భోగీలో ఉన్న రైల్వే పోలీస్ కానిస్టేబుల్ జస్వంత్ సింగ్ ఆమెను వెంబడించాడు. బలవంతంగా బాత్రూమ్‌లోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జస్వంత్ సింగ్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాధిత మహిళ గట్టిగా కేకలు పెట్టింది. 


ఆమె కేకలు విన్న ఇతర ప్రయాణికులు బాత్రూమ్ వద్దకు చేరుకున్నారు. లోపలి నుంచి తలుపు తెరవకపోవడంతో బలవంతంగా పగలగొట్టారు. లోపల మహిళపై అత్యాచారం యత్నం చేస్తున్న జస్వంత్ సింగ్‌ను బయటకు లాగారు. చితక్కొట్టి రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-01-26T21:15:08+05:30 IST