కట్నం తేలేదని ఆ భర్త ఎంతకు తెగించాడంటే.. నడిరోడ్డు మీద కొట్టి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

ABN , First Publish Date - 2022-01-12T16:10:56+05:30 IST

అడిగినంత కట్నం తీసుకురాలేదని ఆ మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు పశువుల్లా ప్రవర్తించారు.

కట్నం తేలేదని ఆ భర్త ఎంతకు తెగించాడంటే.. నడిరోడ్డు మీద కొట్టి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

అడిగినంత కట్నం తీసుకురాలేదని ఆ మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు పశువుల్లా ప్రవర్తించారు. మానవత్వం మరిచి ఆమెను వేధింపులకు గురి చేశారు. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఆ మహిళను ఆమె భర్త చితక్కొట్టాడు. అనంతరం ఆమెను గదిలో పెట్టి తాళం వేసి పస్తులు ఉంచారు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీస్ కేసు కూడా పెట్టారు. చివరకు ఆ మహిళ ఇంటి నుంచి బయటపడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


హర్యానాలోని అంబాలాలో నివసిస్తున్న ప్రవీణ్‌పై అతని భార్య మీనూ మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం కోసం తన భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని చెప్పింది. వారం రోజుల క్రితం కిరాణ కొట్టుకు వెళ్లిన తనను నడిరోడ్డు మీద భర్త ప్రవీణ్ చితకబాదాడని, ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేశాడని, భర్త, ఆమె సోదరి తనను కొట్టారని మీనూ పోలీసులకు చెప్పింది. తనకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అందరికీ చెబుతున్నారని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని ఆమె మహిళ తెలిపింది. 


తనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగిందని, అప్పట్నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మీనూ ఫిర్యాదులో పేర్కొంది. తమకు ఆరేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు ఉన్నట్టు చెప్పింది. కట్నం తీసుకురాకపోతే విడాకులు ఇచ్చేస్తానని, పిల్లలను తన దగ్గరే ఉంచుకుంటానని భర్త బెదిరిస్తున్నాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-01-12T16:10:56+05:30 IST