సూపర్ మార్కెట్‌నే అద్దెకు తీసుకుంటున్న జంట! ఏకాంతంగా షాపింగ్ చేయడానికట.. మేమేం పిచ్చోళ్లం కాదంటూ..

ABN , First Publish Date - 2021-11-25T23:29:55+05:30 IST

అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం కరోనా సంక్షోభం తరువాత సూక్ష్మక్రిములంటే భయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. ఆమె తన భర్త ఇతరులకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎంతగా.. అంటే.. వారు షాపింగ్ చేసే సమయంలో సూపర్ మార్కెట్లో ఒక్కమనిషి కూడా ఉండటానికి వీల్లేదు. ఇందుకు కోసం

సూపర్ మార్కెట్‌నే అద్దెకు తీసుకుంటున్న జంట! ఏకాంతంగా షాపింగ్ చేయడానికట..  మేమేం పిచ్చోళ్లం కాదంటూ..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ఓ మహిళకు కరోనా సంక్షోభం తరువాత సూక్ష్మక్రిములంటే భయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. ఆమె ఇతరులకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతగా అంటే.. ఆమె తన భర్తతో కలిసి షాపింగ్ చేసే సమయంలో సూపర్ మార్కెట్లో  మరో కస్టమర్ ఉండటానికి వీల్లేదు. ఇందుకోసం ఆ జంట ఏకంగా గంట పాటు సూపర్ మార్కెట్ మొత్తాన్నీ అద్దెకు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా టిక్‌టాక్‌ వీడియోలో చెప్పింది. ఇది విపరీతంగా వైరల్ అవడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. నెటిజన్లను ఇలా షేక్ చేస్తున్న ఆమె పేరు ఎమ్మా..! 


ఎమ్మా తన వీడియోలో చెప్పిన దాని ప్రకారం.. తన కుటుంబం షాపింగ్ చేసే సమయంలో సూపర్ మార్కెట్లో ఇతర కస్టమర్లు ఎవరూ ఉండరు. షాపులోని సిబ్బంది కూడా వారికి వీలైనంత దూరం పాటిస్తారు. వారానికొకసారిగా వారు ఇలా షాపింగ్ చేస్తారట. సూక్ష్మక్రిముల భయం లేకుండా ప్రశాంతంగా షాపింగ్ చేసేందుకే ఇలా సూపర్ మార్కెట్‌ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నామని ఎమ్మా చెప్పింది. మరి.. ఇందుకు అద్దె ఎంత చెల్లిస్తున్నారు..? అన్న ప్రశ్నకు మాత్రం ఎమ్మా సమాధానం దాట వేసింది. ‘‘మేమేమీ పిచ్చోళ్లం కాదు.. అందరి లాంటి వాళ్లమే.. మా వద్ద చాలా డబ్బుంది. నా భర్త టీనేజ్‌లో ఉన్నప్పుడు లాటరీ గెలిచాడు. ఆ తరువాత.. దాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి మంచి లాభాలు కళ్ల చూశాం. ఇప్పుడు ఆ డబ్బుతో మా పాపకు మంచి భవిష్యత్తు అందించాలనేదే మా ప్లాన్’’ అని ఎమ్మా చెప్పుకొచ్చింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఎమ్మా, ఆమె భర్త ఇతరుల ఇళ్లకు వెళ్లరు..బయటి వ్యక్తులను తమ ఇంటికి రానీయ్యరు. సూక్ష్మక్రిములంటే భయపడిపోతూ..ఇలా సమాజాన్ని ఆమడ దూరంలో ఉంచుతూ జీవించేస్తున్నారు. 

Updated Date - 2021-11-25T23:29:55+05:30 IST