పేదరికం వల్ల భారీగా అప్పులు చేసిన మహిళ.. అవి తీర్చలేక 13 ఏళ్ల కూతురిని ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-29T06:04:23+05:30 IST

కడు పేదరికంలో ఉన్న ఆ మహిళ తనకు తెలిసిన వ్యక్తి దగ్గర అప్పు చేసింది.. వడ్డీ పెరిగిపోవడంతో ఆ అప్పు కొండంత అయ్యింది.. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆ మహిళ తన కూతుర్ని అమ్మకానికి పెట్టింది...

పేదరికం వల్ల భారీగా అప్పులు చేసిన మహిళ.. అవి తీర్చలేక 13 ఏళ్ల కూతురిని ఏం చేసిందంటే..

కడు పేదరికంలో ఉన్న ఆ మహిళ తనకు తెలిసిన వ్యక్తి దగ్గర అప్పు చేసింది.. వడ్డీ పెరిగిపోవడంతో ఆ అప్పు కొండంత అయ్యింది.. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆ మహిళ తన కూతుర్ని అమ్మకానికి పెట్టింది. 13 సంవత్సరాల వయసులో ఉన్న కూతురిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది.. తను చేసిన అప్పుకు బదులుగా కూతురిని 35 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసింది.. రెండ్రోజుల తర్వాత విషయం తెలుసుకున్న పెదనాన్న పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన ఓ మహిళ తన పొరుగింటి వ్యక్తి దగ్గర చాలా రోజుల క్రితం అప్పు చేసింది. వడ్డీ పెరిగిపోవడంతో అప్పు కొండంత అయింది. అది తీరే మార్గం కనిపించకపోవడంతో తన 13 ఏళ్ల కూతుర్ని అమ్మకానికి పెట్టింది. ఓ మధ్యవర్తి ద్వారా పెళ్లి సెట్ చేసింది. 35 ఏళ్ల వయసున్న వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేసి అప్పు తీర్చేసింది. అయితే రెండ్రోజుల తర్వాత ఆ విషయం ఆ బాలిక పెదనాన్నకు తెలిసింది. 


వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ బాలిక తల్లిని, పెళ్లి చేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టారు.  

Updated Date - 2022-04-29T06:04:23+05:30 IST