వివాహేతర సంబంధం గొడవలో కాలిపోయిన ఇల్లు.. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల బలి!

ABN , First Publish Date - 2022-04-08T08:00:30+05:30 IST

వివాహేతర సంబంధాలు ఎన్నో అకృత్యాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులు తమ భాగస్వాములను చంపుతున్న ఉదంతాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన వివాహేతర...

వివాహేతర సంబంధం గొడవలో కాలిపోయిన ఇల్లు.. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల బలి!

వివాహేతర సంబంధాలు ఎన్నో అకృత్యాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులు తమ భాగస్వాములను చంపుతున్న ఉదంతాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన వివాహేతర సంబంధం కారణంగా తన సోదరుడి కూతుళ్లను పొట్టనబెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు చెందిన బర్ఖా అనే మహిళ గతేడాది వివాహం చేసుకుంది. వివాహానికి ముందే ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. వివాహం తర్వాత కూడా ప్రియుడిని తరచుగా కలిసేది. ఈ విషయం భర్తకు తెలియడంతో వారు తరచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో బర్ఖా కొన్ని నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రికి చెందిన పూరి గుడిసెలో తండ్రి, సోదరుడి కుటుంబంతో పాటు ఉండిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు గత ఆదివారం భర్త వెళ్లాడు. 


ఆ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో బర్ఖాను ఆమె తండ్రి కొట్టాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన బర్ఖా తన తండ్రి గుడిసెకు నిప్పు అంటించింది. ఆ సమయంలో ఆ గుడిసెలో ఉన్న సోదరుడి కుమార్తెలిద్దరూ మంటల్లో కాలిపోయారు. అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-08T08:00:30+05:30 IST