ట్యాంక్‌ నుంచి నీళ్లు రాకపోవడంతో చూడమని చెప్పిన తల్లి.. చూడగానే షాక్‌తో అమ్మా అంటూ అరిచిన కూతురు..!

ABN , First Publish Date - 2021-10-06T03:07:58+05:30 IST

ఇంట్లోని కొళాయిలకు నీళ్లు రావట్లేదు. ట్యాంక్‌లో ఏమైనా అడ్డుపడ్డాయేమో అని అనుకుంది ఆ తల్లి. చూడమని కూతురికి చెప్పింది. పైకెళ్లి చూసిన కూతురు షాక్ అయింది. వెంటనే అమ్మా అంటూ గట్టిగా అరిచింది.

ట్యాంక్‌ నుంచి నీళ్లు రాకపోవడంతో చూడమని చెప్పిన తల్లి.. చూడగానే షాక్‌తో అమ్మా అంటూ అరిచిన కూతురు..!

ఇంట్లోని కొళాయిలకు నీళ్లు రావట్లేదు. ట్యాంక్‌లో ఏమైనా అడ్డుపడ్డాయేమో అని అనుకుంది ఆ తల్లి. చూడమని కూతురికి చెప్పింది. పైకెళ్లి చూసిన కూతురు షాక్ అయింది. వెంటనే అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఏమయ్యిందో అర్థం కాక.. పరుగెత్తుకుంటూ వెళ్లింది తల్లి. అక్కడికి వెళ్లి చూసి అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన వారి కుటుంబం మొత్తం తల్లడిల్లేలా చేసింది. స్థానికులంతా ‘‘ అయ్యో పాపం ఇలా జరిగిందేంటి’’.. అంటూ బాధపడ్డారు. వివరాల్లోకి వెళితే.. 


హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ముగ్గురు కుమార్తెలతో ఓ తల్లి నివాసం ఉంటోంది. పెద్ద కుమార్తెకు వివాహం అయింది. ఆమె భర్త కూడా వారితో కలిసి ఉంటున్నాడు. రెండు ఫోర్షన్లు ఉన్న ఆ ఇంట్లో పై పోర్షన్‌లో ఆమె అక్కాబావ, కింద పోర్షన్‌తో తల్లిదండ్రులు, సదరు బాలిక, ఆమె చెల్లి తన్వీ (17) ఉంటున్నారు. కింద పోర్షన్‌లో టీవీ లేకపోవడంతో అందరూ పై పోర్షన్‌కి వెళ్లి టీవీ చూసేవారు. తన్వీ మాత్రం అప్పుడప్పుడూ అక్క గదిలోనే నిద్రపోయేది. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి కూడా తన్వీ అక్క రూములోనే పడుకుంది. 


ఉదయం ఇంట్లోని కొళాయిలకు నీరు రాకపోవడంతో పైన ట్యాంక్‌ను చెక్ చేయమని పెద్ద కుమార్తెకు తల్లి చెప్పింది. అప్పటికే తన్వి కనబడలేదు. కింద కూడా లేకపోవడంతో బయటికేమైనా వెళ్లిందేమో అనుకున్నారు. ట్యాంక్ చెక్ చేద్దామని పెద్ద కుమార్తె.. ఇంటి పైకి వెళ్లింది. ట్యాంక్ మూత తీసి చూసి షాక్ అయింది. భయంతో అమ్మా అంటూ కేక వేసింది. భయపడ్డ ఆ తల్లి కూడా పరుగెత్తుకుంటూ పైకెళ్లింది. ట్యాంక్‌లో విగతజీవిగా పడి ఉన్న తన్వీని చూసి బోరుమన్నారు. రాత్రి అక్క పక్కనే పడుకున్న తన్వి.. ట్యాంక్‌లో శవమై ఎలా పడి ఉందో మిస్టరీగా మారింది. ఎవరైనా చంపి అక్కడ పడేశారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-06T03:07:58+05:30 IST