బైక్‌ నుంచి జారి పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:06:45+05:30 IST

బొంతిపేట-మెట్టవలస రహదారిపై వెంకటరావుపేట సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి సాది భారతమ్మ (40)అనే మహిళ మృతి చెందింది. భారతమ్మది ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామం.

బైక్‌ నుంచి జారి పడి మహిళ మృతి

లావేరు, ఏప్రిల్‌ 20: బొంతిపేట-మెట్టవలస రహదారిపై వెంకటరావుపేట  సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి సాది భారతమ్మ (40)అనే మహిళ మృతి చెందింది. భారతమ్మది ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామం. ఈమె కుమార్తె నందిని రణస్థలం మండలం లంకపేట కేజీబీవీలో 9వ తరగతి చదువుతుంది. కరోనా కారణంగా మంగళవారం నుంచి పాఠశాలలకు సె లవులు కావడంతో కుమార్తెను తీసుకురావడానికి భారతమ్మ మరో వ్యక్తితో కలసి బైక్‌పై లంకపేటకు వెళ్లింది. ముగ్గురూ కలసి ద్విచక్ర వాహనంపై కుప్పిలికి వస్తుండగా వెంకటరావుపేట సమీపంలో భారతమ్మ జారిపడి తీవ్రంగా గాయప డింది. ఆ సమయంలో అంబులెన్స్‌లు ఏవీ అందుబాటులో లేకపోవడంతో భార తమ్మ కొంతసేపు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరకు తుది శ్వాస విడిచింది. ఈమెను, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి భర్త ఏడేళ్ల కిందట మరో మహి ళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భారతమ్మ తన కాయాకష్టంతో ఇద్దరు  పిల్ల లను పోషించుకుంటుంది. తల్లిమరణంతో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపారు.



Updated Date - 2021-04-21T05:06:45+05:30 IST