కూతురి స్నేహితురాలని నమ్మి ఇంట్లోకి రానిచ్చినందుకు దారుణంగా..

ABN , First Publish Date - 2020-07-05T19:32:06+05:30 IST

స్నేహితురాలి ఇంటి నుంచి రెండు విడతల్లో రూ. 57 లక్షలు కాజేసిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

కూతురి స్నేహితురాలని నమ్మి ఇంట్లోకి రానిచ్చినందుకు దారుణంగా..

న్యూఢిల్లీ: స్నేహితురాలి ఇంటి నుంచి రెండు విడతల్లో రూ. 57 లక్షలు కాజేసిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అమె సోదరులను కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. అమె నుంచి ఓ ఫ్లాట్‌తో పాటూ రూ. 29.43లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పూజా, వరుణ్, అమిత్ డాబర్‌గా వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పుష్ప అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురి స్నేహితురాలైన పూజపై అనుమానం వ్యక్తం చేసింది. ఫ్లాట్ అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో దాచుకుంటే అది కాస్తా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పూజను ప్రశ్నించడంతో విషయం బయటపడింది. పుష్ప ఇంట్లోని కంటైనర్‌లో అంతమొత్తం ఉండటాన్ని కొన్నేళ్ల క్రితం తాను చూశానని పూజ తెలిపింది. 2017లో అందులోంచి రూ. 27 లక్షలు దొంగిలించి తన తమ్ముళ్లకు ఇచ్చింది. వారి చేత ఫ్లాట్ కొనించింది. ఇటీవల పూజ మరోసారి పుష్ప ఇంటికి వెళ్లి మళ్లీ రూ. 30 లక్షలు కాజేసింది. దీంతో పుష్ప ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తెచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు పూజ ద్వారానే ఈ మిస్టరీకి తెరదించారు. అంతే కాకుండా..నిందితుల నుంచి రూ. 29.43 లక్షలతో పాటూ 25 లక్షల విలువైన ఓ ఫ్లాట్‌, నగలను స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2020-07-05T19:32:06+05:30 IST