పెళ్లికి వెళ్దాం రమ్మని పిలిచి.. బాగా మద్యం తాపించి.. ఆ స్నేహితురాలు చేసిన ఘాతుకమిదీ!

ABN , First Publish Date - 2021-07-22T04:10:00+05:30 IST

పెళ్లి చూసొద్దాం రమ్మని పిలిచిందా స్నేహితురాలు. ఎంతైనా ఫ్రెండే కదా అన్ని వెళ్లిందామె. అలా వెళ్లడమే ఆమె జీవితంలో చెరుపుకోలేని తప్పు అవుతుందని ఆమె ఊహించలేదు.

పెళ్లికి వెళ్దాం రమ్మని పిలిచి.. బాగా మద్యం తాపించి.. ఆ స్నేహితురాలు చేసిన ఘాతుకమిదీ!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చూసొద్దాం రమ్మని పిలిచిందా స్నేహితురాలు. ఎంతైనా ఫ్రెండే కదా అన్ని వెళ్లిందామె. అలా వెళ్లడమే ఆమె జీవితంలో చెరుపుకోలేని తప్పు అవుతుందని ఆమె ఊహించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగు చూసింది. స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చూడ్డానికి తోడు రావాలని పిలిచింది మరో యువతి. స్నేహితురాలితో పెళ్లికి వెళ్లిన తర్వాత.. అక్కడ అందరూ మద్యం తాగడం ప్రారంభించారు. తన చేతిలో కూడా ఒక గ్లాసు పెట్టింది ఫ్రెండ్. వద్దంటున్నా బలవంతం చేయడంతో మొహమాటానికి కొద్దిగా పుచ్చుకుంది. అయితే తన ఫ్రెండ్ ఇదంతా పథకం ప్రకారం చేస్తోందని ఆమెకు అప్పుడు తట్టలేదు. ఇలా కాసేపటికి బాగా మత్తెక్కడంతో తూలడం ప్రారంభించింది.


అప్పుడు ఆమె స్నేహితురాలి భర్త, తన ఫ్రెండ్స్‌తో సీన్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. భార్య సైగ అందుకొని మత్తులో ఉన్న ఆమె స్నేహితురాలిని బలాత్కరించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తెల్లారిన తర్వాత మేలుకొన్న ఆ యువతి.. ఇంటికెళ్లింది. భర్త వచ్చాక తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని భోరుమంది. వాళ్లిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలే తన భర్తతో ఇలా అత్యాచారం చేయించడం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. నిందితులంగా మద్యం మాఫియాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వాళ్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-22T04:10:00+05:30 IST