’వారిద్దరూ నన్ను సజీవంగా చంపేశారు‘: మహిళ సూసైడ్ నోట్!

ABN , First Publish Date - 2022-06-12T17:52:40+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గుణ పరిధిలోగల

’వారిద్దరూ నన్ను సజీవంగా చంపేశారు‘: మహిళ సూసైడ్ నోట్!

మధ్యప్రదేశ్‌లోని గుణ పరిధిలోగల ఫతేఘర్‌లో నివసిస్తున్న ఓ మహిళ శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఇంటిలోని గోడపై సూసైడ్ నోట్‌ రాసింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపిస్తూ, దానికి తన కుమారుడే దీనికి సాక్షి అని తెలిపింది. మృతురాలు(42) గోడపై ఇలా రాశారు.. ‘దీపక్ అగర్వాల్‌తో నా పెళ్లయి ఏడాది అయింది. 11 నెలల్లో ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేదు. దీపక్ నాతో మాట్లాడేవాడు కాదు. రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చేవాడు. 2 నిముషాలు మాట్లాడి నిద్రపోయేవాడు. హీనా అనే మహిళ నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నా భర్తతో సంబంధం పెట్టుకుంది. ఆమెను అస్సలు వదలకండి. పట్టుకోండి, హీనాకి కఠినమైన శిక్ష వేయండి. నా కొడుకు వినోద్‌కు  పూర్తి ఆస్తి హక్కులు ఇవ్వాలి.


నా భర్త దీపక్ ప్రతి నెలా ఆ మహిళ వద్దకు వెళ్ళేవాడు. నా భర్త ఎప్పుడూ నాతో ప్రేమగా మాట్లాడలేదు. నాకు తిండి కూడా పెట్టలేదు. కూర్చోని మాట్లాడలేదు. అతను, అతనితో ఉన్న మహిళ నన్ను సజీవంగా చంపారు. నా భర్త నన్ను తీవ్రంగా కొట్టాడు. నా ఆస్తి మొత్తం తీసుకున్నారు. నా బిడ్డ మాత్రమే వారికి వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యం చెబుతాడు. వాడికి అన్నీ తెలుసు. జరిగిన అన్ని విషయాలు నా మొబైల్‌లో ఉన్నాయి’ అని రాశారు. ఫతేగఢ్‌కు చెందిన దీపక్‌ అగర్వాల్‌తో ఆమెకు వివాహమైంది. ఆమెకు దీపక్‌కి ఇది రెండో పెళ్లి కూడా. దీపక్ ఫతేనగర్‌లో పురుగుమందుల విక్రయదారుడిగా పనిచేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగింది. తరువాత కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే ఆ మహిళ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 




Updated Date - 2022-06-12T17:52:40+05:30 IST