మార్చూరీలో మహిళ శవాన్ని తిన్న ఎలుకలు, చీమలు

ABN , First Publish Date - 2021-05-06T15:29:35+05:30 IST

ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలో ఉన్న మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తిన్న దారుణ ఘటన....

మార్చూరీలో మహిళ శవాన్ని తిన్న ఎలుకలు, చీమలు

ఆజంఘడ్ (ఉత్తరప్రదేశ్): ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలో ఉన్న మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తిన్న దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్‌ఘడ్ జిల్లాలో వెలుగుచూసింది. రోడ్డు పక్కన గాయాలతో ఉన్న గుర్తుతెలియని మహిళను ఏప్రిల్ 29వతేదీన బల్రాంపూర్ మండల ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో మరునాడు మహిళ మరణించింది. దీంతో మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు.మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించక పోవడంతో దాన్ని మార్చూరీలో వదిలిపెట్టారు. దీంతో ఎలుకలు, చీమలు మహిళ మృతదేహాన్ని పాక్షికంగా తిన్నాయి. 


మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తిన్న విషయం గురువారం వెలుగుచూసింది.దీంతో ఆజంఘడ్ ఆసుపత్రిలో కలకలం రేగింది. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి వైద్యులు, పోలీసులను అప్రమత్తం చేశామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే మిశ్రా చెప్పారు. మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.


Updated Date - 2021-05-06T15:29:35+05:30 IST