వివాహిత మృతి
ABN , First Publish Date - 2020-11-30T04:38:44+05:30 IST
సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు ధూళి పాళ ధనుంజయనాయుడు కుమార్తె చిత్తూరి సద్విజ(31) ఆకస్మికంగా మృతి చెందింది.
నేరేడుచర్ల, నవంబరు 29:సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు ధూళి పాళ ధనుంజయనాయుడు కుమార్తె చిత్తూరి సద్విజ(31) ఆకస్మికంగా మృతి చెందింది. లోబీపీతో నేరేడుచర్లలోని ఆమె నివాసంలో శనివారం రాత్రి మృతి చెందినట్లు తండ్రి తెలిపారు. సద్విజ మృతదేహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు ఎల్లావుల రాములు, పోకల వెంకటేశ్వర్లు, కొప్పు సూర్యనారాయణ, టీజేఎస్ కన్వీనర్ వురిమళ్ల రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు కొణతం చిన్నవెంకటరెడ్డి, నూకల సందీ్పరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి కొదమగుండ్ల నగే్షలు సంతాపం వెలిబుచ్చారు. మృతురాలికి భర్త చిత్తూరు యువరాజు, కుమారుడు నివేదనాయుడులు ఉన్నారు.