సమాజానికి మహిళ మూలకేంద్రం: చినజీయర్
ABN , First Publish Date - 2022-03-18T22:52:33+05:30 IST
ఇటీవల చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయవాడ: ఇటీవల చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేడు లక్ష్మీదేవి పుట్టిన రోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి వద్దకు చేరిన రోజు. సమాజానికి మహిళ మూలకేంద్రం. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం బాగుంటుంది. మహిళ ఎప్పటికీ పూజ్య స్థానమే. నేడు అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవమని చెప్పాలి. మహిళ శక్తి కేంద్రం. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజులు చెప్పారు. జ్ఞానం చూసి పలువురు దళితులకూ ఆరాధ్య స్థానం ఇచ్చారు’’ అని జీయర్స్వామి తెలిపారు.