తాగునీటి కోసం మహిళల ధర్నా

ABN , First Publish Date - 2021-04-21T06:54:37+05:30 IST

మండల కేంద్రంలోని పాత వూరికి చెందిన మహి ళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు.

తాగునీటి కోసం మహిళల ధర్నా

ముదిగుబ్బ, ఏప్రిల్‌ 20: మండల కేంద్రంలోని పాత వూరికి చెందిన మహి ళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. తాగునీటి కోసం మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ ధర్నా వ ద్దకు వచ్చి మహిళలతో మాట్లాడారు. పది రోజుల నుంచి తాగునీరు రాలేదని, ఈ విషయంపై పలు మార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదని అందుకే ధర్నా చేస్తున్నామని ఏఎస్‌ఐకి విన్నవించారు. అనంతరం నూతన సర్పంచ లక్ష్మీ దేవి, భర్త చండ్రాయుడు వచ్చి తాగునీటి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఽమహిళలు ధర్నా విరమించుకుని వెనుతిరిగారు.

Updated Date - 2021-04-21T06:54:37+05:30 IST