HYD : బోనాలకొచ్చి మద్యం తాగి నిద్రపోయిన మహిళ.. తెల్లారేసరికి బాత్రూమ్లో...!
ABN , First Publish Date - 2021-07-29T18:18:36+05:30 IST
కుమార్తెకు 2019లో దమ్మాయిగూడకు చెందిన సాగర్తో వివాహం అయింది. లాక్డౌన్ కారణంగా
హైదరాబాద్ సిటీ/బోయిన్పల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. బోయిన్పల్లి కోయబస్తీకి చెందిన చిత్తారి సునీత(45) రోజువారి కూలీ. ఆమె భర్త యాదగిరి పదేళ్ల క్రితం చనిపోయాడు. సునీతకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, కుమారులు భరత్, సాయి ఉన్నారు. కుమార్తెకు 2019లో దమ్మాయిగూడకు చెందిన సాగర్తో వివాహం అయింది. లాక్డౌన్ కారణంగా పనులు దొరకక ఆర్థిక ఇబ్బందులతో సునీత మద్యానికి బానిసయింది. మంగళవారం బోనాల పండుగకు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. మద్యం తాగి పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది.
బుధవారం తెల్లవారు జామున ప్రసన్నలక్ష్మి బాత్రూమ్కు వెళ్లేందుకు లేవగా తల్లి సునీత ఇంటి పైకప్పు ఇనుపరాడ్డుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె వెంటనే సోదరుడిని నిద్ర లేపి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అంత్యక్రియలను ఆపేశారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.