మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలి: యనమల

ABN , First Publish Date - 2022-02-14T00:05:55+05:30 IST

మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలి: యనమల

అమరావతి: మహిళలు జగన్‌కు బుద్ధి చెప్పాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జగన్ ఇచ్చేది తక్కువ.. లాక్కునేది ఎక్కువని తప్పుబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంటే.. జగన్‌ ఆదాయం విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. డ్వాక్రా గ్రూపులకు అన్యాయం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల్లో 10 శాతం రిజర్వేషన్లు తీసేశారని యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు.

Updated Date - 2022-02-14T00:05:55+05:30 IST