మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ABN , First Publish Date - 2021-04-24T05:03:06+05:30 IST
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
టెక్కలి రూరల్, ఏప్రిల్ 23: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొండేల సుజాత, మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, ఏపీఎంలు, సీఎఫ్లు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.