మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN , First Publish Date - 2021-04-24T05:03:06+05:30 IST

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 23: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సున్నావడ్డీ పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మహిళాభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొండేల సుజాత, మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, ఏపీఎంలు, సీఎఫ్‌లు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-04-24T05:03:06+05:30 IST