మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-05-15T04:24:47+05:30 IST

మహిళలు ఆర్థికంగా ఎదగాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం జన్కా పూర్‌లోని రైతువేదికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
స్ర్తీనిధి రుణాల చెక్కును అందజేస్తున్న జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, మే 14: మహిళలు ఆర్థికంగా ఎదగాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం జన్కా పూర్‌లోని రైతువేదికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రుణా లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని 105 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకురుణాలు, స్త్రీనిధిరుణాల చెక్కు లను అందజేశారు. ఎంపీపీ మల్లిఖార్జున్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌ పాల్గొ న్నారు.

గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి

మండలంలోని రౌట గ్రామం లో మౌలిక వసతులు కల్పించా లని శనివారం జడ్పీటీసీ అరి గెల నాగేశ్వర్‌రావు గ్రామస్థుల తో కలిసి అదనపుకలెక్టర్‌ వరు ణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తాగునీరు, రోడ్డు వసతిలేకగ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని అన్నారు.  ఎంపీపీ మల్లిఖార్జున్‌, పీఏసీఎస్‌చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read more