చేయూత ద్వారా మహిళలకు భరోసా
ABN , First Publish Date - 2021-06-23T07:06:26+05:30 IST
సీఎం జగన్ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా భరోసా అందిస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
తాళ్లూరు, జూన్ 22 : సీఎం జగన్ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా భరోసా అందిస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆదుకునేందుకు రెండో విడతగా వైఎస్సార్ చేయూత ద్వారా నియోజకవర్గంలోని 9670 మంది మహిళలకు 18, 13,12,500 రూపాయల నగదును బ్యాంక్ అకౌంట్లకు మంగళవారం ఎమ్మెల్యే జమచేశారు. స్థానిక గ్రామసర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి, మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఏఏంసీ చైౖర్మన్ ఐ.వేణుగోపాల్రెడ్డిలు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీకోటేశ్వరరావు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ డీఈ రాఽథోడ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్కం విజయలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ ఐ.రమావెంకటేశ్వరరెడ్డి, మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల వలసారెడ్డి, వైకేపీ ఏరియా కోఆర్డినేటర్ రజనీకాంత్, ఏపీఎం వెంకట్రావు పాల్గొన్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువలో పాలన
గ్రామసచివాయల వ్యవస్థతో ప్రజల చెంతకు పాలన వచ్చిందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పారు. తాళ్లూరు, విఠలాపురం గ్రామాల్లో రూ.1.85 కోట్లతో నిర్మించిన సచివాలయాలు, వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్లు ఇంద్రసేనారెడ్డి, కొర్రపాటి శ్రీదేవి, జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మారం వెంకటరెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, మాజీ వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, పి.బ్రహ్మయ్య, ఏఈ సుబ్బయ్య, వ్యవసాయాధికారి బి.ప్రసాద్రావు, ఈవోఆర్డీ దారా హనుమంతరావు, పాల్గొన్నారు.
స్థలదాతకు ఎమ్మెల్యే సత్కారం
విఠలాపురంలో గ్రామసచివాలయ భవనాల నిర్మాణాలకు అనువైన స్థలాన్ని ఉచితంగా అందజేసిన పాలం తాతిరెడ్డిని ఎమ్మెల్యే వేణుగోపాల్ శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన మాజీ సర్పంచ్ లోకిరెడ్డి నాగసేనారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పరామర్శించారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం పొలం మేతకు వెళ్లగా పిడుగుపాటుకు గురై నాగసేనారెడ్డి, కుమారుడు శివశంకర్రెడ్డిలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి పెద్దకుమారుడు విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.