మళ్లీ పెళ్లి కోసం 9నెలల శిశువును అమ్మిన తల్లి
ABN , First Publish Date - 2021-10-03T02:09:19+05:30 IST
ఇద్దరు బ్రోకర్ల సహాయంతో పిల్లలు లేని హెచ్ సెల్వమణి (52), శ్రీదేవి (40) దంపతులకు మూడు లక్షల రూపాయలకు అమ్మేశారు. అయితే జెబమలార్ భర్త మణికందన్కు ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు..
చెన్నై: మొదటి భర్తతో తగాదాల వల్ల విడిపోయి రెండవ పెళ్లికి సిద్ధమైన ఓ మహిళకు తన 9 నెలల కన్నబిడ్డే అడ్డమైంది. అంతే.. కన్న పేగును తెంచుకుంది. తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో జరిగిందీ దారుణ సంఘటన. వాస్తవానికి తతంగం అంతా గుట్టుగా జరిగినప్పటికీ విడిపోయిన భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
జెబమలార్ (28) అనే మహిళకు ఆర్ మణికందన్ (38) అనే వ్యక్తితో 2019లో పెళ్లైంది. అయితే కొద్ది రోజుల అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి విడిపోయారు. అప్పటికి వారికి ఒక చంటి బిడ్డ. అయితే తన బిడ్డతో కలిసి జెబమలార్ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు జెబమలాక్కు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో 9 నెలల చంటి బిడ్డ రెండో పెళ్లికి అడ్డని కుటుంబ జెబమలార్తో సహా సభ్యులంతా భావించారు.
ఇద్దరు బ్రోకర్ల సహాయంతో పిల్లలు లేని హెచ్ సెల్వమణి (52), శ్రీదేవి (40) దంపతులకు మూడు లక్షల రూపాయలకు అమ్మేశారు. అయితే జెబమలార్ భర్త మణికందన్కు ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సెల్వమణి, శ్రీదేవిలను అరెస్ట్ చేసి 9 నెలల పసిబిడ్డను అదుపులోకి తీసుకున్నారు. జెబమలార్ సహా ఆమె కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.