కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేసిన సర్కార్

ABN , First Publish Date - 2021-05-07T21:55:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేసిన సర్కార్

అమరావతి : రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. సచివాలయం, ఆయా శాఖల అధినేతలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 12 గంటల తర్వాత కార్యాలయాలు ఉండాలంటే మాత్రం పాసులు కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనకు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. 




Updated Date - 2021-05-07T21:55:23+05:30 IST