ప్రతి బుధవారం శ్రమదానం చేయించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-07-05T11:28:28+05:30 IST
గ్రామ పంచాయతీల్లో ప్రతి బుధవారం శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించేలా ఎంపీడీఓలు, ఎంపీఓలు చర్యలు
కలెక్టరేట్(మహబూబ్నగర్), జూలై 4: గ్రామ పంచాయతీల్లో ప్రతి బుధవారం శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించేలా ఎంపీడీఓలు, ఎంపీఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెం కట్రావు సూచించారు. గ్రామస్తులందరితో కనీసం అరగంటపాటు ఈ కార్యక్రమం నిర్వహించాల న్నారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయం నుం చి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, అధికారులతో సమీక్ష చేశారు.
ఈ రెండు నెలల పాటు గ్రామాల్లో పారిశు ధ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. పారిశుధ్య నిర్వ హణలో 50 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు ఉం టాయని హెచ్చరించారు. వానాకాలంలో వ్యాధు లు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పల్లె ప్ర గతిలో చేపట్టిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్, మానిట రింగ్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీపీఓ వెంకటే శ్వర్లు, డీఆర్డీఓ వెంకటరెడ్డి, పాల్గొన్నారు.