విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-01-25T06:55:10+05:30 IST

ఉంగుటూరుకు చెందిన గేదెల రమేష్‌ (38) అనే చేపల ప్యాకింగ్‌ కార్మికుడు మృతి చెందడంతో న్యాయం కోసం అతని బంధువులు ధర్నా చేశారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు

న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా

ఉంగుటూరు, జనవరి 24:  ఉంగుటూరుకు చెందిన గేదెల రమేష్‌ (38) అనే చేపల ప్యాకింగ్‌ కార్మికుడు  మృతి చెందడంతో న్యాయం కోసం అతని బంధువులు ధర్నా చేశారు.   ఏలూరు రూరల్‌ మండలం గుడివాడ లంక గ్రామంలో చేపల లోడుపై ప్రయాణిస్తున్న రమేష్‌ విద్యు దాఘాతానికి గురై మృతి చెందడంతో లారీ, చేపల చెర్వుల యజమానులు నష్టపరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై మృతుడి బంధువులు ధర్నా చేశారు. దీంతో సంబంధిత యాజమాన్యం  రూ. 5 లక్షలు  ఇచ్చేందుకు అంగీకరించడంతో ధర్నా విరమించారు. 

Updated Date - 2022-01-25T06:55:10+05:30 IST