కరెంట్ షాక్తో కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-05-07T05:51:30+05:30 IST
కరెంట్ షాక్తో కార్మికుడి మృతి
ఇబ్రహీంపట్నం: వరికోత యంత్రంపై వడ్లు పడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి అక్కడిక్కడే మృత్యువాతపడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన వీరముత్తు వీరన్ తన హార్వెస్టర్తో పోచారంలో ఓ పొలంలో వరికోస్తున్నారు. అదే యంత్రంపై పనిచేసే మనివేల్(29) యంత్రంపై కూర్చుని వడ్లు పడుతున్నాడు. అదే సమయంలో వీరముత్తు వీరన్ యంత్రాన్ని రివర్స్ చేసిన సమయంలో పైన ఉన్న 11కేవీ వైర్లు మనివేల్ మెడకు తగిలి షాక్ కొట్టి మృతిచెందాడు. నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.