నాపరాళ్లు మీదపడి కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-12-03T05:40:25+05:30 IST
బేతంచెర్ల-కర్నూలు రహదారిలోని ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ సమద్ (20) అనే యువ కార్మికుడు హై పాలిష్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నాపరాళ్లు మీద పడడంతో మృతి చెందాడు.
బేతంచెర్ల, డిసెంబరు 2: బేతంచెర్ల-కర్నూలు రహదారిలోని ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ సమద్ (20) అనే యువ కార్మికుడు హై పాలిష్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నాపరాళ్లు మీద పడడంతో మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. భార్యాభర్తలు శ్యామ్, సుభిత కర్నూలు రహదారిలోని అయ్యల చెరువు ప్రాంతంలో వినాయక ఘాట్ సమీపంలో ఉన్న ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. శ్యామ్ సమద్పై నాపరాళ్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బేతంచెర్ల సీఐ కేశవరెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సమీక్షించారు. శ్యామ్ సమద్ భార్య సుభిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. శ్యామ్కు ఏడాది కూతురు ఉంది.