పెర్సాపేన్‌కు నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయుల పూజలు

ABN , First Publish Date - 2022-05-16T04:18:30+05:30 IST

మండలంలోని ఉషేగాం దేవు గూడలో నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయులు ఆదివారం ఘనం గా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేస్రం నాగ్‌భీడ్‌ వంశీయులు నైవేధ్యంతో పెర్సాపేన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ వంశంలో నూతనంగా ఇంట్లో అడగు పెట్టిన కోడళ్లకు పేర్సాపేన్‌ వద్ద పరిచయం చేసి బేటింగ్‌ చేశారు.

పెర్సాపేన్‌కు నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయుల పూజలు
బేటింగ్‌లో మేస్రం వంశ కొత్త కోడళ్లు

జైనూరు, మే 15: మండలంలోని ఉషేగాం దేవు గూడలో నాగ్‌భీడ్‌ మేస్రం వంశీయులు ఆదివారం ఘనం గా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేస్రం నాగ్‌భీడ్‌ వంశీయులు నైవేధ్యంతో పెర్సాపేన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ వంశంలో నూతనంగా ఇంట్లో అడగు పెట్టిన కోడళ్లకు పేర్సాపేన్‌ వద్ద పరిచయం చేసి బేటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా 97మంది మేస్రం వంశం కోడళ్లు బేటింగ్‌లో పాల్గొని పెర్సా పేన్‌కు నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఐటీడీఏ జీసీడీవో ఛాయ లక్ష్మీకాంత్‌, రెవెన్యూ అధికారి రేఖ ప్రహ్లాద్‌, గ్రామ పటేల్‌ మేస్రాం నాగోరావ్‌, కటోడా నాగు, సర్పంచులు సార్జా బాయి శంకర్‌, ఆత్రం జాలీశావ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:18:30+05:30 IST