పవనకళ్యాణ్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2021-04-18T06:26:42+05:30 IST
జనసేన అధినేత, హీరో పవన కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు శనివారం మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమరాపురం, ఏప్రిల్ 17: జనసేన అధినేత, హీరో పవన కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు శనివారం మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు నవీన, పవన,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.