రెండు మండలాల వారధి..సొగసు చూడు మరీ!

ABN , First Publish Date - 2021-07-21T05:13:39+05:30 IST

మెళియాపుట్టి, పలాస మండలాలను కలుపుతూ ఉన్న గ్రామీణ రహదారి ఇది. ముక్తాపురం రోడ్డు నుంచి సంతలక్ష్మీపురం మీదుగా గోదావరిపురం వరకూ సుమా రు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. టీడీపీ ప్రభుత్వ హ యాంలో పక్కా రహదారిగా మార్చేందుకు నిర్ణయిం చారు.

రెండు మండలాల వారధి..సొగసు చూడు మరీ!
అడుగుకో గొయ్యి దర్శనమిస్తున్న దృశ్యం



అధ్వానంగా సంతలక్ష్మీపురం రోడ్డు

మెళియాపుట్టి: మెళియాపుట్టి, పలాస మండలాలను కలుపుతూ ఉన్న గ్రామీణ రహదారి ఇది. ముక్తాపురం రోడ్డు నుంచి సంతలక్ష్మీపురం మీదుగా గోదావరిపురం వరకూ సుమా రు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. టీడీపీ ప్రభుత్వ హ యాంలో పక్కా రహదారిగా మార్చేందుకు నిర్ణయిం చారు. నిధులు సైతం విడుదల చేశారు. ఇంతలో ఎన్ని కలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండేళ్లుగా రోడ్డు నిర్వహణ పనులు చేపట్టలేదు. దీంతో రహదారి పొడవునా అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నీరు చేరింది. ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురవు తున్నారు. ఈ రహదారిపై పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. 




Updated Date - 2021-07-21T05:13:39+05:30 IST