గ్యాస్ లీకై గాయపడ్డ బాలిక మృతి
ABN , First Publish Date - 2021-01-22T05:13:49+05:30 IST
గ్యాస్ లీకై మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాహ్నవి(10) గురువారం మృతిచెందింది.
సూళ్లూరుపేట, జనవరి 21 : గ్యాస్ లీకై మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాహ్నవి(10) గురువారం మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. గత నెల 28వ తేదీన సూళ్లూరుపేటలోని సూళ్లూరు వీధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో భార్యాభర్తలు, వారి కొడుకు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వారిని చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.