యువతికి న్యాయం చేయాలని రాస్తారోకో

ABN , First Publish Date - 2022-09-26T03:46:23+05:30 IST

గిరిజన యువతికి న్యాయం చేయాలని దళిత సం ఘాల నాయకులు ఆదివారం కూరగాయల మార్కెట్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు కుంబాల రాజేష్‌, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆసాధి మధులు మాట్లాడుతూ నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతిని ఇదే గ్రామా నికి చెందిన బొమ్మెన సంతోష్‌గౌడ్‌ ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసు కుంటానని చెప్పి మోసం చేశాడన్నారు

యువతికి న్యాయం చేయాలని రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న దళిత సంఘాల నాయకులు

బెల్లంపల్లి, సెప్టెంబరు 25: గిరిజన యువతికి న్యాయం చేయాలని దళిత సం ఘాల నాయకులు ఆదివారం కూరగాయల మార్కెట్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు కుంబాల రాజేష్‌, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆసాధి మధులు మాట్లాడుతూ నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతిని ఇదే గ్రామా నికి చెందిన బొమ్మెన సంతోష్‌గౌడ్‌ ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసు కుంటానని చెప్పి మోసం చేశాడన్నారు. ఐదు లక్షల రూపాయల కట్నం మాట్లా డుకుని మరో మహిళతో ప్రేమ కొనసాగిస్తున్నాడన్నారు. సంతోష్‌గౌడ్‌ సోదరుడు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీష్‌గౌడ్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకు ని గిరిజన యువతికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సంతోష్‌గౌడ్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు ఎరుకల నర్సింగ్‌, మద్దెల గోపి, మురళి, చక్రధర్‌, నర్సయ్య, గోపాల్‌, సురేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-26T03:46:23+05:30 IST