WTC Final: టీమిండియా 170 ఆలౌట్‌.. కివీస్‌ టార్గెట్‌ 139

ABN , First Publish Date - 2021-06-24T01:18:56+05:30 IST

కివీస్ పేసర్లు చెలరేగడంతో టీమిండియా మరోసారి స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.

WTC Final: టీమిండియా 170 ఆలౌట్‌.. కివీస్‌ టార్గెట్‌ 139

కివీస్ పేసర్లు చెలరేగడంతో టీమిండియా మరోసారి స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. సౌథీ (4/48), బౌల్ట్ (3/39) విజృంభించడంతో టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. పంత్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 32 పరుగుల ఆధిక్యం లభించడంతో ఇప్పుడు లక్ష్యం 139 పరుగులుగా తేలింది. 


రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 47 ఓవర్లలో ఇంకా 129 పరుగులు చేయాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కివీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.  ఆటకు ఈ రోజు చివరి రోజు అనే సంగతి తెలిసిందే. అంతకు ముందుకు 64/2 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆటకు దిగిన కోహ్లీ సేన స్కోరు బోర్డుకు మరో 106 పరుగులు జోడించగలిగింది.

Updated Date - 2021-06-24T01:18:56+05:30 IST