SCO Summit : భారత్‌కు మద్దతిస్తాం : జీ జిన్‌పింగ్

ABN , First Publish Date - 2022-09-16T21:05:08+05:30 IST

వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (SCO) అధ్యక్ష పదవిలో భారత దేశాన్ని

SCO Summit : భారత్‌కు మద్దతిస్తాం : జీ జిన్‌పింగ్

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్) : వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (SCO) అధ్యక్ష పదవిలో భారత దేశాన్ని నియమించడానికి మద్దతిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) చెప్పారు. ఎస్‌సీఓ సదస్సులో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగించిన అనంతరం జిన్‌పింగ్ తన మద్దతును ప్రకటించారు. 


‘‘వచ్చే ఏడాది ఎస్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్నందుకు భారత దేశానికి అభినందనలు. వచ్చే ఏడాది ఎస్‌సీఓ ప్రెసిడెన్సీకోసం భారత దేశానికి మేం మద్దతిస్తాం’’ అని జిన్‌పింగ్ చెప్పారు. అంతర్జాతీయ వ్యవస్థ మరింత న్యాయంగా, హేతుబద్ధంగా అభివృద్ధి చెందేవిధంగా ప్రపంచ నేతలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. నిష్ప్రయోజనకరమైన పనులను, కూటమి రాజకీయాలను వదిలిపెట్టాలన్నారు. ఐక్యరాజ్య సమితిని ఆసరాగా తీసుకుని అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. 


రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కూడా భారత దేశానికి అభినందనలు తెలిపారు. పుతిన్, మోదీ శుక్రవారం సాయంత్రం సమావేశమవుతారు. 


Updated Date - 2022-09-16T21:05:08+05:30 IST