యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
ABN , First Publish Date - 2022-03-07T16:36:03+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు.
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. యాదాద్రిలో గవర్నర్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. యాదాద్రిలో నాలుగో రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వటపత్రసాయి అలంకార సేవలో లక్ష్మీ నరసింహస్వామి వారిని తమిళిసై దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. తెలంగాణ బడ్జెట్ ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు.