నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-03-11T13:39:31+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు.
యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీరామ అలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహుడు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో గజ వాహన సేవలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం జరుగనుంది. సీఎం కేసీఆర్,శోభ దంపతులు కళ్యాణానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే యాదాద్రి ఆలయ బంగారు తాపడం కోసం తమ కుటుంబం తరఫున సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని అందజేయనున్నారు.