యాదాద్రిలో 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం

ABN , First Publish Date - 2022-03-16T17:07:56+05:30 IST

యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది.

యాదాద్రిలో 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం

యాదాద్రి : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ జరగనుంది. స్వప్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన నిర్వహించనున్నారు. 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం జరగనుంది.

Updated Date - 2022-03-16T17:07:56+05:30 IST