యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి భారీగా బంగారం వితరణ
ABN , First Publish Date - 2021-11-08T18:40:37+05:30 IST
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీగా బంగారం వితరణ వచ్చింది.
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీగా బంగారం వితరణ వచ్చింది. మేడ్చల్లో దాతల సహకారంతో 7 కిలోల బంగారాన్ని స్వామి వారి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.3.50 కోట్ల నగదు, చెక్కులను ఆలయ ఈవో గీతారెడ్డికి మంత్రి మల్లారెడ్డి అందజేశారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడానికి ఇప్పటి వరకు సుమారుగా 10 కిలోల బంగారానికి మొత్తం రూ. 4.93 కోట్ల నగదు, చెక్కులను మంత్రి అందజేశారు. తొలి విడతలో అక్టోబర్ 28న రూ.1.83 కోట్లు, ఈరోజు రూ.3.10 కోట్లను మంత్రి మల్లారెడ్డి విరాళంగా అందజేశారు.