నడిరోడ్డులో నిలువెత్తు గుంత
ABN , First Publish Date - 2022-01-15T04:24:13+05:30 IST
మండలంలోని యాగర్ల కూడలి వద్ద నడిరోడ్డుపై నిలువెత్తు గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది.
పట్టించుకోని అధికారులు
ఇందుకూరుపేట, జనవరి 14 : మండలంలోని యాగర్ల కూడలి వద్ద నడిరోడ్డుపై నిలువెత్తు గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. మూడు మండలాల కూడలి అయిన వంతెనపై ఈ గుంత రెండు అడుగుల వెడల్పుతో ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన కింద నిండుగా ప్రవహించే జాఫర్సాహెబ్ కాలువ ఉండడం, ఏదైనా ప్రమాదం జరిగితే పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు మాత్రం గుంత వద్ద ముళ్ల కంప వేసి, ఎర్రగుడ్డను ఓ కర్రకు పాతారు. ఈ మలుపులు ఉన్న వంతెన వద్ద కొత్తవారు గానీ, తెలియని వారు చీకట్లో వచ్చినా ప్రమాదం తప్పనిసరి. అందులోనూ ఆక్వా పరిశ్రమలు, రైతులు, బీచ్ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.